హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 11: హుజూరాబాద్ మండలంలోని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో సభాస్థలి వద్ద పనులు నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రముఖుల స్జేజీ, గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభకు తరలివచ్చే ప్రజలు, ప్రముఖులు, మీడియా కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.