మంచిర్యాల: మంచిర్యాల (Mancherial) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నస్పూర్లో ఉన్న అల్లూరి కాలనీలో కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడో భర్త. అనంతరం పిల్లలతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.