గజ్వేల్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ సమీపంలోని రాణి కంపెనీ నీ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్టణానికి చెందిన జగ్గయ్యగారి శ్రీధర్ జలజ దంపతులు బుధవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గజ్వేల్కు కారులో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రాణే కంపెనీ సమీపంలో కారు డివైర్ను ఢీకొని.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ జలజ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రమాద సంఘటన స్థలికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను వెలికితీసి గజ్వేల్ మార్చరీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సంఘటన తెలియడంతో పట్టణవాసులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని దంపతుల మృతదేహాలను చూసినవారంతా కన్నీటిపర్యంతమయ్యారు.