CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ సీఎం. ఆయన ఆ పార్టీ బాటలోనే నడుస్తున్నారా? లేక బీజేపీ బాటలో నడుస్తున్నారా? అన్నది ప్రజలకు, కాంగ్రెస్ నేతలకు అర్థం కాని గందరగోళ పరిస్థితి. ఎందుకీ పరిస్థితి అంటే.. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలది ఒక మాట అయితే, సీఎం రేవంత్ది ఇంకో మాట. దీంతో అసలు కాంగ్రెస్ విధానం ఏమిటన్నది అర్థం కాకుండా ఉన్నది. ప్రతి అంశంలో రాజకీయ పారీక్టి ఒక లైన్ అనేది ఉంటుంది.
పార్టీ వైఖరి ప్రకారమే నాయకుల స్పందన ఉంటుంది. అది ఆ పార్టీ కట్టుబాటు. ఏ స్థాయి నాయకుడైనా దానికి కట్టుబడి ఉండక తప్పదు. కానీ విచిత్రం ఏమిటంటే ఢిల్లీలో కాంగ్రెస్ విధానం ఒకలా ఉంటే, అందుకు విరుద్ధంగా రేవంత్ తీరు ఉన్నది. ‘ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి కట్టది మరోదారి’ అన్న చందంగా సాగుతున్న రేవంత్ వైఖరి పట్ల రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నది.
ఖర్గే, రాహుల్ ఓవైపు.. రేవంత్ మరోవైపు
ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది ఒక రాజకీయ కుట్ర అని, కేంద్రంలో బీజేపీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. అయితే సీఎం రేవంత్రెడ్డి మాత్రం తమ ఏఐసీసీ అగ్రనేతల అభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం జరిగిందని, రూ.వందల కోట్లు చేతులు మారాయని, ఈ స్కాంలో నిందితులను ముందే అరెస్టు చేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టులో జాప్యం ఎందుకు జరిగిందంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్కు చెందిన సీఎం రేవంత్రెడ్డి బీజేపీ నేతల మాదిరి మాట్లాడటం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి నేతల్లో స్పందించనిది ఒక్క రేవంతే
కేజ్రీవాల్ అరెస్టుపై ‘ఇండియా కూటమి’ భాగస్వామ్య పక్షాలు, సీఎంలు స్పందించి కేంద్రంలో బీజేపీ సర్కారును తప్పుబట్టాయి. కానీ దీనిపై స్పందించని విపక్ష నేతలు ఎవరైనా ఉన్నారా? అంటే అది రేవంత్రెడ్డి ఒక్కరే. కేజ్రీవాల్ అరెస్టును బీజేపీ నేతలు సమర్థిస్తున్నట్టుగా వారితో రేవంత్ ఏకీభవిస్తున్నారా? కాం గ్రెస్కు భిన్నంగా ఆయన తీసుకున్న వైఖరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.