యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య (Justice Chandraiah) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా నారసింహుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం జరుపగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న జస్టిస్ చంద్రయ్యకు అర్చకులు, అధికారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.