తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు (Devotees) పెద్దఎత్తున తరలిరావడంతో రద్దీ నెలకొన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Sri Venkateswara Swamy) సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. దీంతో క్యూ కాంప్లెక్స్లోని (Q complex) కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో టీబీసీ (TBC) వరకు భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు.
ఇక సోమవారం స్వామివారిని 78,126 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. 37,597 మంది భక్తులు శ్రీవారికి తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.