హనుమకొండ: హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి (Inavolu Mallanna) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతున్నది. మల్లన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు స్నానపు గదులు లేకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.