హైదరాబాద్ సిటీబ్యూరో ; శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు, ఎయిర్పోర్టు అధికారులు ముందస్తు సూచనలు చేసినా.. శనివారం కూడా రద్దీ తగ్గలేదు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి కొందరు ప్రయాణికులకు నిర్ణీత సమయానికి బోర్డింగ్ కాక ఇబ్బంది పడ్డారు. పంద్రాగస్టు నేపథ్యంలో ఎయిర్పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు. సీఐఎస్ఎఫ్, స్పెషల్, స్టేట్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరే రావాలని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి సూచించారు.