కోదాడ, ఫిబ్రవరి 7 : సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ ఏడో వార్డులో కాంగ్రెస్ నాయకులు ఓ టర్లను ప్రలోభపర్చేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా తప్ప తాగిన కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా వారిపై దాడులు చేశారు. దాడులను నిరసిస్తూ కోదాడ జర్నలిస్టులు శనివారం ప్రధాన రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రాలు సమర్పించారు. కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వారికి హామీ ఇచ్చారు