హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం బలంగా ఆవరించి ఉన్నది. దాంతో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మహబూబ్నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీస్ తెలిపింది.
శని, ఆదివారాలలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శుక్రవారం ఉపరితల ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తుకు వ్యాపించి ఉన్నదని వివరించింది.