హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఖాలీద్ అహ్మద్ జమీర్ హైదరాబాద్లో సిటీ ఆఫ్ టెర్రస్గార్డెన్స్ సభ్యుడు హరికార శ్రీనివాసరావుతో విలేకరులతో మాట్లాడారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 120 స్టాల్స్తో ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24 మేళాను ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ఏడాది గ్రాండ్ మేళాకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, టెర్రస్ గార్డెన్ నిర్వాహకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఖాలీద్ అహ్మద్ తెలిపారు.
గ్రాండ్ మేళాలో హిమాచల్ప్రదేశ్కి చెందిన ఆపిల్ మొక్కలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో సాగయ్యే ఆపిల్ మొక్కలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రదర్శనలో పలు రకాల ఔషధ మొక్కలు, ఆర్గానిక్ ఎరువులు, పూల మొక్కలు, తోటల పెంపకానికి అవసరమైన పరికరాలు, పూలకుండీలు, విత్తనాల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని వివరించారు.