హుజూరాబాద్ టౌన్/జమ్మికుంట/జమ్మికుంట రూరల్/కమలాపూర్/ఇల్లందకుంట, అక్టోబర్ 4: హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ దళం రోజురోజుకూ మరింత బలపడుతున్నది. ప్రతి రోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి శ్రేణులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో హుజూరాబాద్లోని రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో 22, 27 వార్డులకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్లో చేరినవారిలో బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి భాషవేని భాసర్యాదవ్, బీజేపీ 37వ బూత్ ఇంచార్జి మంతుర్తి శ్రీకాంత్యాదవ్, 43వ బూత్ ఇంచార్జి కాపర్తి సంతోష్తోపాటు 20 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఇల్లందకుంటలో శ్రీరాములపల్లి ఉప సర్పంచ్ గుత్తికొండ రవికుమార్, వార్డు సభ్యులు వాసాల లక్ష్మణ్, తిప్పరబోయిన సమ్మయ్య రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కమలాపూర్ మండలం భీంపల్లికి చెందిన పలువురు యువకులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామం టీఆర్ఎస్కే జైకొట్టింది. బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన 150 మంది నాయకులు, యువకులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, క్లస్టర్ ఇంచార్జి రావుల శ్రీధర్రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు.