బాన్సువాడ (కామారెడ్డి) : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కృషితో హైదరాబాద్కు భారీగా ఐటీ పెట్టుబడులు( IT Investments) , భారీ పరిశ్రమలు(Industrys) వస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam) అన్నారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ. 6 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న ఎస్సీ, బీసీ మహిళా పోస్టు మెట్రిక్ వసతి గృహాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత దాదాపు 8.75లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కేవలం రెండు లక్షలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్( TS iPass) ద్వారా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో దాదాపు 25వేల పరిశ్రమలు నెలకొల్పి రూ.3లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని వివరించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 17లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా మారిందని విద్యా రంగానికి సీఎం కేసీఆర్(CM KCR) అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. సమాజంలో 80శాతం నిరుపేద, పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని వివరించారు. ప్రతిపేద విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సొంత బిడ్డల్లా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.