మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన కర్ణాటకలో వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. నిన్న మధ్యాహ్నం 18000 క్యూసెక్కుల నీరు రాగా, సాయంత్రం నుంచి పెరుగుతూ సోమవారం ఉదయానికి 22,873 క్యూసెక్కులకు పెరిగింది. ఔట్ ఫ్లో 15,477క్యూసెక్కులుగా ఉంది. ఇవాళ సాయంత్రానికి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 1041 అడుగుల నీటిమట్టం ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 7.407 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.