హైదరాబాద్: ఎగువన వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ప్రాజెకు మూడు గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం 4,061 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతున్నది. జలాశయంలోకి 14,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అధికారులు 10,521 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాపెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.960 మీటర్ల వద్ద నీటి మట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు. 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.