భీమ్గల్/నంగునూరు, అక్టోబర్ 16 : బీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. పలు సంఘాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్కు విరాళాలు ప్రకటిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో ఆదివారం బీఆర్ఎస్ కోసం సుమారు రూ.80 వేలు అందజేశారు. కేసీఆర్కు ఎప్పుడు అండగా ఉంటామని వారు ప్రకటించారు. కాగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో గ్రామస్థులు రూ.41,116 విరాళాన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్కు అందజేశారు. సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు. ఆదివారం రాంపూర్, బద్దిపడగ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి ‘ఒక విద్యార్థి-ఒక రూపాయి’ విరాళం కార్యక్రమాన్ని నిర్వహించారు.