ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని (Dharmapuri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Sri Lakshmi Narasimha swamy Temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం (Sravana Masam) శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో నారసింహుని దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది.