సిద్దిపేట: జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వసంత పంచమి కావడంతో తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిరారు. వసంత పంచమి వేడుకల్లో భాగంగా అమ్మవారు విద్యాజ్యోతిగా దర్శనమిస్తున్నారు. అక్షరాభ్యాసం కోసం చిన్నారులు వేలాదిగా ఆలయానికి వస్తున్నారు. దీంతో అధికారులు మూడు మండపాల్లో అక్షరాభ్యాసం కోసం ఏర్పాట్లు చేశారు.