సిద్ధిపేట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండో ఆదివారం (లష్కర్వారం) సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు గతవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కొవిడ్ నిబంధనల మధ్య అధికారులు భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు.