ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 28: తేజా రకం ఎండుమిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా ధర రూ.21,650 పలకడంతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో ఇదే మార్కెట్లో సాధారణ రకం తేజా పంటకు గరిష్ఠ ధర క్వింటాకు రూ.18 వేలు పలుకగా.. మూడు రోజుల క్రితం రూ.21,600 పలికింది. మంగళవారం మరో రూ.50 పెరగడంతో మూడు రోజుల క్రితం నమోదైన రికార్డు తిరగరాసినట్టయింది. కాగా మార్కెట్కు 41,141 బస్తాల మిర్చి వచ్చింది.