యాదగిరిగుట్ట, జనవరి 8 : స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, మాడవీధులు, ప్రసాద విక్రయశాలలు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు రద్దీగా కన్పించాయి.
సత్యనారాయణస్వామి వ్రత మండపం కూడా భక్తులతో కిటకిటలాడింది. ధర్మదర్శనానికి దాదాపు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు. రూ.45,86,412 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.