జగిత్యాల: జిల్లాలోని కొడిమ్యాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెక్కారు. నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జాతర కొనసాగుతున్నది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున భక్తులు క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతో నారసింహుని దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది. నేటి సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు.