Backlog Posts | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలున్నా యి. 2వేలకు పైగా ఉద్యోగాలు భర్తీకాకుం డా మిగలనున్నాయి. ప్రభుత్వం తీసుకు న్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రూప్-4 ఫలితాలను గురువారం విడుదల చేశారు. 8,180 పోస్టులకు 8,084 పోస్టుల ఫలితాలు విడుదల చేశారు. అయితే ఉద్యోగాలు పొందిన వారిలో చాలా మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారున్నారు. కొందరు టీచర్లుండగా, మరికొందరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా మంచి శాఖల్లో, మంచి పోస్టు వస్తే గ్రూప్-4 ఉద్యోగంలో చేరాలన్న ఆశతో గ్రూప్-4కు రాశారు. అయి తే చాలా మందికి మంచి పోస్టులు దక్కలేదు. దీంతో వారంతా ఆయా పోస్టులను వదులుకోనున్నారు. తుది ఫలితాలకు ముందు ఆన్విల్లింగ్(ఉద్యోగం ఇష్టంలేదని) ఆప్షన్ తీసుకుంటే ఈ పోస్టులు బ్యా క్లాగ్ అయ్యేవికావని, నిరుద్యోగులకు న ష్టం జరిగేది కాదని అభ్యర్థులంటున్నారు.
ఇప్పుడు బ్యాక్లాగ్ అయిన పోస్టులను మళ్లీ భర్తీచేసే అవకాశాలు కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో గ్రూప్-4 నోటిఫికేష న్ వచ్చే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్-4 ప్రస్తావనే లేదు. గ్రూప్-4ను రద్దుచేసి, ఆయా పోస్టులను గ్రూప్-3లో విలీనం చేస్తారనే ప్రచా రం ఉంది. ఇది వరకు పోస్టుల భర్తీ లో రీలింక్విష్మెంట్ అవకాశం క ల్పించారు. కానీ అకస్మాత్తుగా రీలింక్విష్మెంట్ ఆప్షన్ను ప్రభుత్వం తొలగించినట్టు అభ్యర్థులు వాపోతున్నారు. అటు ఆ న్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ఇ టు రీలింక్విష్మెంట్ ఆప్షన్ను తొలగించడంతో తమకు తీవ్ర అన్యా యం జరుగుతుందని వాపోతున్నా రు. ఆన్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.