హైదరాబాద్ : యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ సమ్మేళనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో సదర్ సమ్మేళనం భారీ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సదర్ కు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు .
ఈ నెల 27 న సాయంత్రం నారాయణ గూడ, ముషీరాబాద్ లలో నిర్వహించే సదర్ కు జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రికల్, పోలీసు, ట్రాఫిక్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు, కల్చరల్ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, కళ్యాణ్ కార్ ఈశ్వర్ చౌదరి, శంకర్ రావు, గులాబ్ సింగ్ గంగపుత్ర, నీలం వేణు యాదవ్, జిట్టా ఆంజనేయులు, ఎడ్ల వరుణ్ కుమార్ యాదవ్, అభినందన్ యాదవ్, ఆశ్రిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.