హైదరాబాద్ : భద్రాచలంలో(Bhadrachalam) భారీగా గంజాయిని(Huge ganja) పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు కూనవరంలోని ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో తనిఖీలు చేప ట్టారు. రెండు వాహనాల్లో తరలిస్తున్న 472 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మోతుగూడెం, సుకుమామిడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.