హైదరాబాద్, మే 24(నమస్తే తెలంగా ణ): ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడి నష్ట నివారణకు వానకాలం, యాసంగి సాగును ముందుకు జరపడం ఎలా అ న్న అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలో మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, కొప్పుల, ఐకేరెడ్డి సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది.
శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులతో ఆయా అంశాలపై చర్చించారు. యాసంగి కాలాన్ని ముందుకు జరిపేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. యాజమాన్య పద్ధతులు, తకువ కాలంలో తకువ పెట్టుబడితో ఎకువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగు తదితర అంశాలపై చర్చించారు. మరోసారి సమావేశమై ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.