TSPSC | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమ్స్లో ఒక అభ్యర్థికి ఎన్ని మార్కులొచ్చాయో రెండో వ్యక్తికి కూడా తెలియదు. అభ్యర్థి తన ఓఎమ్మార్ను, ఫైనల్ కీ పేపర్తో సరిపోల్చుకొని ఒక అంచనాకు వచ్చిన తర్వాత తనకు వచ్చిన మా ర్కులను స్వయంగా ప్రకటించుకోవాల్సిందే. వెబ్సైట్ను సంప్రదించి నేరుగా ఫలితాలను తెలుకొకునే అవకాశమే లేదు. అది పరీక్ష రాసిన వ్యక్తి బహిర్గత పరిస్తే తప్ప మరొకరికి తెలియ దు. ఇక కమిషన్ వెబ్సైట్లోగానీ, ఫలితాల్లోగానీ ఎక్కడా మార్కులనేవే ఉండవు. వాటిని కమిషన్ ప్రకటించలేదు. గ్రూప్-1లో తొలిసారిగా మల్టీపుల్ జంబ్లిగ్ విధానాన్ని అనుసరించారు. ఈ విధానంలో ప్రశ్నలు మారిపోవడమే కాకుండా.. ప్రశ్నలకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు సైతం మారిపోయాయి. ఒక అభ్యర్థికి వచ్చిన ప్రశ్నపత్రాన్ని మరో అభ్యర్థి పేపర్తో పోల్చడానికి అస్సలు వీలుపడదు.
గ్రూప్ -1 ఫలితాలను కటాఫ్ మార్కుల్లేకుండానే ప్రకటించారు. ఏ ఉద్యోగార్థికి ఎన్ని మార్కులొచ్చాయో.. ఈ క్యాటగిరీలో ఏ మా ర్కుల వరకు కటాఫ్ అయ్యింది అనే వివరాలను టీఎస్పీఎస్సీ ప్రకటించలేదు. మల్టీజో న్, రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 503 పోస్టులకు 25,150 మంది హాల్టికెట్ నంబర్లను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థి జనరల్ కోటాలో ఎంపికయ్యారా లేక రిజర్వుడ్ కోటాలోనా? అన్నది కూడా తెలియనంత గోప్యంగా ఫలితాలను వెల్లడించారు. అందువల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ వార్తలను నమ్మొద్దని ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది.