ప్రారంభించిన హెచ్వోపీ ఎలక్ట్రిక్
హైదరాబాద్, ఏప్రిల్ 2: దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ..దక్షిణాదిలో ఉన్న మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నాలుగు రాష్ర్టాల్లో పలు ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్లో రెండు సెంటర్లను ఆరంభించింది. వీటిలో హైదరాబాద్లోని హిమాయత్నగర్, మహబూబబాద్ జిల్లా లోని కేసముద్రం, వరంగల్లలో ఎక్స్పీరియన్స్ సెంటర్లను నెలకొల్పింది. అలాగే ఏపీలో పెద్దాపురం, గుంటూరులలో వీటిని ఆరంభించింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వివేక్ థోమర్ మాట్లాడుతూ..ప్రతియేటా భారత్లో 2 కోట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి, వీటిలో 60 లక్షలు స్కూటర్లు, బైకులు ఉన్నాయి.
ఇటీవల కాలంలో చమురు ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో ప్రస్తుతం ఈవీలపై కొనుగోలుదారులు దృష్టి సారిస్తున్నారని చెప్పారు. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో ఈవీలు, బ్యాటరీ, చార్జింగ్ సదుపాయాలు కూడా లభించనున్నాయి. కిలోమీటర్కు 20 పైసలు ఖర్చు కానున్నది. సింగిల్ చార్జ్తో 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. వీటితోపాటు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, బెంగాల్లలో కూడా ప్రారంభించింది.