హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఇరాక్ పర్యటనకు వెళ్లారు. కర్బలాలో నవాసా రసూల్ హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల సమాధులను సందర్శించి ఫాతిహా పఠించారు.