Mahmood Ali | రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ వెల్లివిరుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని అన్నారు. మట్కా, గ్యాంబ్లింగ్ వంటి నేరాలకు ఫుల్స్టాప్ పడిందని చెప్పారు.
రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా భారీగా పెంచామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. వాటిలో మౌళిక సదుపాయాలు కూడా మెరుగుపరిచామని తెలిపారు. సీసీ టీవీల సంఖ్యను కూడా పెంచామన్నారు. అన్ని శాఖలను పటిష్టం చేసినట్టే పోలీసు శాఖను కూడా బలోపేతం చేశామని వివరించారు. మొబలిటీ, విజిబిలిటీ కోణంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణలో తప్ప షీ టీమ్స్ దేశంలో ఎక్కడా లేవని మహమూద్ అలీ పేర్కొన్నారు. 331 షీ టీమ్స్ బృందాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. దేశంలోనే మన పోలిసింగ్ నంబర్వన్ స్థానంలో ఉందని స్పష్టం చేశారు.