హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, దేశ ప్రజలందరి కోసం హజ్యాత్రికులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. బుధవారం నాంపల్లిలోని హజ్హౌస్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలు దేరగా, ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సును హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్తో కలిసి హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికులను ఉద్దేశించి హోం మంత్రి మాట్లాడారు. హజ్కమిటీ ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఈ సందర్భంగా యాత్రికులకు వివరించారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, స్టేట్ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసియుల్లా ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు.