హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. ఉప ఎన్నిక పోలింగ్ రోజు(నవంబర్ 3)న స్థానికంగా సెలవు ప్రకటించేందుకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాలు ఉన్న కార్యాలయాలు, సంస్థలకు పోలింగ్ ముందు రోజు కూడా సెలవు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసే కార్యాలయానికి లెక్కింపు రోజున కూడా సెలవు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.