హైదరాబాద్, డిసెంబర్20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీల సమగ్ర కులగణను నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి, బీసీసంక్షేమ శాఖ మంత్రికి బీసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ను బుధవారం సచివాలయంలో ప్రత్యేకంగా కలిసి, శాలువాతో సతరించారు. అనంతరం బీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బీసీ విద్యార్థుల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయాలని కోరారు. ప్రత్యేకసమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని బీసీ నేతలు వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి, నేతలు చిన్న శ్రీశైలంయాదవ్, కులచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్గౌడ్, ఉప్పర శేఖర్, మణిమంజరి, శ్రీనివాస్గౌడ్ తదితరులు ఉన్నారు.