హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): నగరంలో చారిత్రక మెట్ల (దిగుడు) బావులకు పూర్వవైభవం తేవడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా కృషిచేస్తున్నాయి. ఇందులోభాగంగా మెట్ల బావులను శుభ్రం చేసి, పునరుద్ధరిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 44 చోట్ల దిగుడు బావులను పునర్నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు 17 చోట్ల మెట్లబావులను పునర్నిర్మించి పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. మిగిలిన బావుల్లో పనులు కొనసాగుతున్నాయి.