నిర్మల్ : మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఖానాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా మారాడన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ఎన్నో మంచి పథకాలను ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా నాయక్ తో కలిసి కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కె.విజయ లక్ష్మి , ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, తదితరులు పాల్గొన్నారు.