హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రాంతీయ రాష్ర్టాల్లో ప్రయాణించే విమానాల్లో స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇండిగో ఎయిర్లైన్స్కు విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్, హిందీ రానివారి సౌకర్యార్థం తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలు మాట్లాడేవారిని నియమించాలని ఆదివారం ట్విట్టర్లో కోరారు. ఈనెల 16న ఓ మహిళా ప్రయాణికురాలు విజయవాడ నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో వస్తుండగా, ఆమెకు కేటాయించిన సీటు నుంచి బలవంతంగా వేరే సీటులోకి మార్చా రు. భద్రతా కారణాల వల్లనే మార్చాల్సి వచ్చిందని ఎయిర్హోస్ట్ చెప్పారు. అయితే వాస్తవానికి ప్రయాణికురాలికి తెలుగు తప్ప వేరే భాష రాదు. అందుకే ఆమెను వేరే సీటులో కూర్చొబెట్టినట్లు ఓ ప్రయాణికుడి ట్వీట్పై కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.