Jogulamba Temple | జోగులాంబ గద్వాల : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ దేవస్థానం నుండి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,ఈవో పురేందర్ కుమార్, ఆలయ ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ, వేద పండితులు వంకాయల శ్యాం కుమార్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు.
హిందూస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించారు. కాగా సంస్థ యొక్క కార్యవర్గం సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న శక్తిపీఠాలకు ప్రదానం చేశారు.
శ్రీ జోగులాంబ ఆలయాన్ని ప్రతిష్టాత్మక హిందూస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు- 2022 దక్కడంపై తెలంగాణ రాష్ట్రంలోని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ పరిస్థితులలో సైతం తుంగభద్ర పుష్కరాలను విజయవంతం చేసినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేసి, దర్శనాలు కల్పించామని తెలిపారు.