హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ విద్యలో రాష్ర్టాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్(ఏఐఎంఎస్)తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
మంగళవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సమక్షంలో మం డలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఏఐఎంఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.