హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కో ర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత వి ద్యామండలి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఫస్టియర్లోని ఖాళీ సీట్ల భర్తీకి షెడ్యూల్ను శనివారం విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి కౌ న్సెలింగ్ ప్రారంభంకానున్నది. ఇప్పటికే ఇంజినీరింగ్ సీట్ల భర్తీ పూర్తికాగా, ఇటీవలే ఫార్మసీ కోర్సుల సీట్లనూ కేటాయించారు.
ఆయా కోర్సు ల్లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు వీలుగా అధికారులు ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్ను సైతం అధికారులు విడదల చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశమివ్వగా, 21న సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు.