హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 5వేల మంది పోలీసులతో భద్రత కల్పించనున్నట్టు టీటీడీ ప్రధాన భద్రతాధికారి తెలిపారు.
కరోనా ప్రభావంతో రెండేండ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ఉత్సవాలకు అశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నదని చెప్పారు. ఘాట్దారుల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక పోలీసు బృందాలను నియమిస్తామని చెప్పారు.