2,07,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి వరద భారీగా వస్తున్నది. ఆదివారం ఎగువ నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద రాగా 33 వరద గేట్లతో 1,99,680 క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091.00 అడుగులు (90.313 టీఎంసీలు) సామర్థ్యం కాగా ఆదివారం సాయంత్రానికి 1,090.90 అడుగుల(89.763 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. కృష్ణా బేసిన్లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగు తున్నది. 71 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవు తుండగా 67,489 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 21,692 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 10,497 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా వస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 57,613 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 68,393 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. నాగార్జునసాగర్కు 60,752 ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో దిగువకు వెళ్తున్నది. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు 589.70 (311.1486 టీఎంసీలు) మేరకు నీరు నిల్వ ఉన్నది.