హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): టాన్స్జెండర్ కోటా కింద నీట్ పీజీ సీటు కేటాయింపునకు చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వారం రోజులు గడువు ఇస్తే జీవో వెలువడుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ చెప్పారు. ఇందుకు అనుమతించిన హైకోర్టు పిటిషన్పై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో సూచించినా..
జాతీయ మెడకల్ కమిషన్(ఎన్ఎంసీ) జారీచేసిన నీట్ పీజీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో ఎకడా ఆ ఆంశాన్ని పేరొనలేదని హైదరాబాద్కు చెందిన కొయ్యల రూత్ జాన్పాల్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్స్జెండర్ కోటా లేదా ఇతర కోటా కింద పిటిషనర్కు ఏది ప్రయోజనం ఉంటుందో ఆ మేరకు నీట్ పీజీ సీటు కేటాయించాలని ఎన్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులు వెలువడి నెల రోజులు దాటినా అమలు కాలేదంటూ జాన్పాల్ హైకోర్టును మరోసారి ఆశ్రయించగా, విచారణ జరిగింది.