హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా నివారణకు వినియోగించే మందులను ‘అత్యవసర మందుల జాబితా’లో చేర్చేందుకు ఇంకెంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఇంకెం త మంది అమాయకులు కరోనా వైరస్తో చనిపోయిన తర్వాత దానిని ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ నిర్ణయమూ వెల్లడించకుండా కాలయాపన చేయడంపై మండిపడింది. నిర్ణ యం త్వరలో తీసుకుంటామని ప్రతిసారీ చెప్ప డం సరికాదని పేర్కొంది. కరోనాపై దాఖలైన వేర్వే రు ప్రజాహిత వ్యాజ్యాలను తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. కేం ద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, జాబితాపై వివరాల సమర్పణకు గడువు కావాలని కోరడంతో హైకోర్టు ఆగ్రహించింది. నత్తనడకగా వ్యవహారాలు ఉంటే కుదరదని హెచ్చరించింది. నెలాఖరునాటికి అత్యవసర ముందుల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వ ఔషధశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. ఈ ఉదయం ఇమెయిల్ ద్వారా కేంద్ర ఔషధశాఖ పంపిన సమాచారం ప్రకారం పారాసిటమాల్, మిథైల్, ప్రెటీనీసోలిన్, డెనామిక్సిమితోసన్, ఎనాక్రఫిన్, ఆక్సిజన్ జాబితాలో ఉన్నాయని రాజేశ్వర్రావు చెప్పారు. ఎస్ఎంసీఎం సిఫార్సుల ప్రకారం వీటిని అత్యవసర మందుల జాబితాలో చేర్చినట్టు తెలిపారు. మందుల జాబితాపై ఫోన్ ద్వారా కేంద్ర అధికారి నుంచి ఇప్పుడే సమాచారం అందిందని చెప్తే, అఫిడవిట్ రూపంలో ఇవ్వాళని స్పష్టంచేసింది.
వైద్య పోస్టులపై అఫిడవిట్ ఇవ్వండి
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న మొత్తం వైద్యుల పోస్టులు, ఖాళీల వివరాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. మొత్తం పోస్టులు, ఖాళీల భర్తీకి తీసుకున్న చర్యలను వివరిస్తూ వైద్యశాఖ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. జిల్లాలవారీగా వైద్యుల, పిల్లల వైద్యుల పోస్టుల ఖాళీలను నివేదించాలని సూచించింది. పండుగల సీజన్ వస్తున్నందున ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని, విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్కు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఉత్తర్వులు జారీచేసింది. జూలై 16 నుంచి సెప్టెంబర్ 19 మధ్యకాలంలో ఆర్ఏటీ పరీక్షలు 50.45 లక్షలు చేయగా, ఆర్టీపీసీఆర్ పదిశాతమే (5.95 లక్షలు) ఎందుకు చేశారని ప్రశ్నించింది. ఐసీఎమ్మార్ మార్గదర్శకాల మేరకు రోజుకు దాదాపు 55 వేల ఆర్ఏటీ పరీక్షలు చేస్తున్నామని, వైరస్ తీవ్రత తగ్గినందున టెస్టులు కూడా తగ్గాయని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాస్రావు వివరించారు. తొలి డోస్ పూర్తిచేసేందుకు మరో నాలుగు వారా లు, సంపూర్ణ వ్యాక్సినేషన్కు మూడు నెలలు పడుతుందని చెప్పారు. విద్యాసంస్థల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, పిల్లలకు రాలేదని చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు.. పిల్లలకు పాజిటివ్ రాకపోయినా, వారి ద్వారా ఇండ్లలోని పెద్దలకు, పాఠశాలల్లోని సిబ్బందికి సోకే ప్రమాదమున్నదని హెచ్చరించింది. కలర్కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ (సీజీజీఆర్ఏ) యాక్షన్ ప్లాన్ గురించిన ప్రశ్నకు ప్రభుత్వ విధాన నిర్ణయమని శ్రీనివాస్రావు చెప్పబోగా.. విధాన నిర్ణయమా? హైకోర్టు ఉత్తర్వులా..? ఏది అమలుచేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభు త్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. వాదనల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలాఖరు నాటికి అఫిడవిట్లు దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.