హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఐటీ పార్కు ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఆ భూసేకరణ ఖరారు నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూసేకరణలో భాగంగా 2005 ఏప్రిల్ 16న జారీ చేసిన ఆర్(1) నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమారులు సురేశ్, వెంకటేశ్, ఇతర కుటుంబసభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.
ఐటీ పారు భూసేకరణ నిమిత్తం 2005 మార్చి 10న ప్రాథమిక నోటిఫికేషన్ను జారీచేసి అభ్యంతరాలను ఆహ్వానించారని, దానిపై ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సమర్పించిన విచారణ నివేదికను పరిశీలించిన అనంతరం భూసేకరణను ఖరారు చేస్తూ 16న జిల్లా కలెక్టర్ ఆర్(1) నోటిఫికేషన్ జారీ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో సెక్షన్ 5ఏ ప్రకారం భూసేకరణపై విచారణ జరిపి ఆ నివేదికను భూమి యజమానులకు అందజేయాల్సి ఉన్నదని, వ్యక్తిగతంగా వారి అభ్యంతరాలను తీసుకున్న తర్వాతే నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉన్నదని హైకోర్టు పేరొంటూ.. పిటిషనర్లకు చెందిన 26 ఎకరాల భూసేకరణ ఖరారు నోటిఫికేషన్ను రద్దు చేసింది.