హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని హైకోర్టు తీర్పునిచ్చినందున ఈ సంక్షోభానికి పరిష్కారం చూపాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
ఎన్సీటీఈ నిబంధనలను సవరించుకొనే వెసులుబాటు ఉన్నందున ఈదిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి భిక్షంగౌ డ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మా రెడ్డి అంజిరెడ్డి కోరారు. విద్యాశాఖ ఉమ్మడి జాబితాలోని అంశం కావున ఈ మేర కు సవరణలు చేసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. నిలిచిపోయిన పదోన్నతుల షెడ్యూల్ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.