High Court | హైదరాబాద్, ఫిబ్రవరి24 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వరకు తెలంగాణలో చదివి రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ గీత్యా ఏపీకి తల్లి వెళ్లడంతో అకడ ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థినికి ఎంబీఏ ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ర్టానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థిని నుంచి పరీక్ష ఫీజు స్వీకరించి, పరీక్షలకు అనుమతించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ రాజ్యంపై విచారణ పూర్తయ్యే వరకు ఫలితాలను వెల్లడించరాదని పేర్కొన్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వరంగల్ వాగ్దేవి కాలేజీలో ఎంబీఏ చేస్తున్న బీ వాసంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ జరిపారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్కు, వాగ్దేవి కాలేజీ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.