హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కేసు నమోదైన 180 రోజుల్లోగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోతే నిందితుడు బెయిల్ పొందేందుకు అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పింది. గంజాయి రవాణా కేసులో పోలీసులు 180 రోజులైనా చార్జిషీటు వేయలేదని, అయినా కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదని కే శ్రీనివాస్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
దీనిపై ఇటీవల జస్టిస్ కే సురేందర్ విచారణ జరిపి పిటిషనర్కు బెయిల్ మంజూరు చేశారు. రూ.50 వేల విలువైన రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని, పోలీసులు చార్జిషీటు దాఖలు చేసేదాకా, లేదా 3 నెలల వరకు ప్రతి ఆదివారం పోలీస్స్టేషన్లో పిటిషనర్ హాజరుకావాలనే షరతు విధించారు.