యాదాద్రి: యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి యదాద్రికి చేరుకున్న ఆమె ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు. బుధవారం ఉదయం స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయ ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం జస్టిస్ నందకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామి వారి ప్రసాదం అందజేశారు.