హైదరాబాద్ : యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండ గట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు ( Yuva Sangrama Sadassu ) కు హైకోర్టు ( High Court ) షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది . శనివారం సరూర్ నగర్ ( Saroor Nagar ) లో జరిగే సదస్సు కోసం ఇప్పటికే బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి.
ఈ సభకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు గత రెండు వారాల క్రితమే పోలీసుల ను కోరగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అనుమతి విషయం శుక్రవారం కోర్టులో విచారణకు రాగా పరిశీలించిన న్యాయమూర్తి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. యువ సంగ్రామ సదస్సు జరగకుండా అడ్డుకోవాలని కుట్రలు చేసిన రేవంత్ సర్కార్కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. 17 రోజులుగా అనుమతి పై నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది.