హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): విత్తన కల్తీలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు విత్తన వ్యాపారులపై ప్రభుత్వ నియంత్రణ లేదంటూ అందిన లేఖను హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్ ధర్మాసనం ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి, విచారణ చేపట్టింది.
కల్తీ విత్తనాల సరఫరాకు సంబంధించి 2014-22 మధ్యకాలంలో పోలీసులు 991 కేసులు నమోదు చేసినట్టు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.